రూ. 17.8 లక్షల కోట్లు కోల్పోయిన ధనవంతులు
NEWS Apr 05,2025 10:03 am
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్ దెబ్బకు వ్యాపార, వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం పడింది.కొత్త పన్ను చట్టం అమల్లోకి వచ్చిన మొదటి రోజే ప్రపంచంలోని అత్యంత ధనవంతులకు కోలుకోలేని షాక్ తగిలింది. దాదాపు తమ సంపదను పెద్ద మొత్తంలో కోల్పోయారు. ఏకంగా రూ. 17.8 లక్షల కోట్లు ఆవిరై పోయాయి. వీరిలో ఫేస్ బుక్ ఫౌండర్ జుకర్ బర్గ్ 1.53 లక్షల కోట్లు, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ రూ. 51.36 లక్షల కోట్లు, ఎక్స్, టెస్లా చైర్మన్ ఎలాన్ మస్క్ రూ. 94 వేల కోట్లు నష్ట పోయారు.