కేసీఆర్ కీలక సమావేశం
NEWS Apr 04,2025 05:09 pm
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ బలోపేతానికి అవలంబించాల్సిన అంశాలపై నేతలతో చర్చించారు. మాజీ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.