బర్మా అధినేతతో ప్రధాని మోదీ భేటీ
NEWS Apr 04,2025 04:40 pm
బర్మా సైనిక ప్రభుత్వ అధినేత జనరల్ మిన్ అంగ్ హ్లాయింగ్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ప్రస్తుతం థాయ్లాండ్ పర్యటనలో ఉన్నారు. అనంతరం బిమ్ స్టెక్ సదస్సులో పాల్గొంటారు. భూకంపంతో దెబ్బ తిన్న మయన్మార్ను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు మోదీ. అనుసంధాన, సామర్థ్యాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై చర్చించినట్లు 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు మోదీ.