సచివాలయంలో భద్రతపై సీఎం ఆరా
NEWS Apr 04,2025 04:31 pm
ఏపీ సచివాలయంలో జరిగిన అగ్నిప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు సీఎం చంద్రబాబు, మంత్రి వంగలపూడి అనిత. పేరుకు పోయిన చెత్తా చెదారాన్ని 24 గంటల్లోపు తీసి వేయాలని ఆదేశించారు.సచివాలయంలో భద్రత పైనా ఆరా తీశారు. భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని ప్రశ్నించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నివేదిక అందిందన్నారు ఈ సందర్బంగా మంత్రి అనిత. ప్రమాదం జరిగిన సమాచారం అందిన వెంటనే అగ్ని ప్రమాద సిబ్బంది మంటలను ఆర్పేశారని తెలిపారు. అధికారుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు.