టీజీ జెన్కోలో 163 ఉద్యోగ నియామకాలు
NEWS Apr 04,2025 04:28 pm
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు కింద ఇండ్లు కోల్పోయిన వాళ్లకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క. వీరిలో112 మందితో పాటు ఆర్థిక శాఖకు చెందిన 51 మందికి నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా భట్టి మాట్లాడుతూ తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ వస్తాయన్నారు.