7 నుంచి వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
NEWS Apr 04,2025 03:43 pm
MBNR: ఈ నెల 7 నుంచి జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవాలని కలెక్టర్ విజయేంద్రబోయి అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ఇన్ఛార్జులు, ఏపీఎంలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..వరి ఏ గ్రేడ్ రకానికి రూ.2,320, బి గ్రేడ్ రకానికి రూ.2,300 ధర నిర్ణయించినట్లు వెల్లడించారు.