వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం చారిత్రాత్మకం
NEWS Apr 04,2025 03:18 pm
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదం చారిత్రాత్మకం అన్నారు. వక్ఫ్బోర్డు కార్యకలాపాలపై ఎప్పటి నుంచో ఆందోళనలు జరుగుతున్నాయని, తాజా సవరణతో పేద ముస్లింలకు న్యాయం జరుగుతుందన్నారు. మోదీ నాయకత్వంలో దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు. ప్రతిపక్షాల అభిప్రాయాన్ని గౌరవిస్తూ చర్చ జరిపిన తీరు ప్రజాస్వామ్యానికి నిదర్శనం అన్నారు. దేవుని ఆస్తి దోచుకోవడం నేరమే కాదు, మోసం చేయటమేనని అన్నారు పవన్ కళ్యాణ్.