గ్రూప్-1 ఫలితాలపై అనుగుల కామెంట్స్
NEWS Apr 04,2025 03:15 pm
బీఆర్ఎస్ సీనియర్ నేత అనుగుల రాకేశ్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షలకు సంబంధించిన ఫలితాలలో టాప్ 100లో ఒక్క తెలుగు మీడియం స్టూడెంట్ లేక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ తెలుగు నేల మీద, తెలంగాణ గడ్డ మీద నిర్వహించిన పరీక్షలో ఒక్క తెలుగు మాధ్యమానికి సంబంధించిన యాస్పిరెంట్ లేక పోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. దీనిపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.