మున్సిపల్ కమిషనర్ సిబ్బంది సన్మానం
NEWS Apr 04,2025 11:25 am
మున్సిపాలిటీ ఆస్తి పన్ను వసూళ్లలో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన తొలి 10 మున్సిపాలిటీల్లో మెట్పల్లి మున్సిపాలిటీ అవార్డు అందుకున్న సందర్భంగా మున్సిపల్ కార్మికుల పక్షాన మున్సిపల్ కమిషనర్ టి మోహన్ కి ఘనంగా శాలువలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అక్షయ్ కార్మిక సంఘం అధ్యక్షుడు, బర్ల లక్ష్మణ్, లంక శ్రీకాంత్, లోకిని మహేష్ కుమార్, సుమన్, ముజీబ్, నిజాం, అశోక్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.