సచివాలయంలో అగ్ని ప్రమాదంపై ఆరా
NEWS Apr 04,2025 09:43 am
అమరావతి లోని సచివాలయం రెండో బ్లాక్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై హోం మంత్రి వంగలపూడి అనిత వెంటనే స్పందించారు. ఈ ఘటనపై ఆరా తీశారు. ఫైర్ సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పినట్లు వెల్లడించారు పోలీస్ ఉన్నతాధికారులు. బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు వివరించారు. ప్రమాదానికి గల కారణాలను తేల్చాలని మంత్రి ఆదేశించారు.