రామేశ్వరం తాంబరం మధ్య కొత్త రైలు
NEWS Apr 04,2025 09:57 am
రామేశ్వరం-తాంబరం మధ్య కొత్త రైలు ప్రారంభం కానుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ రైలు 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు రామేశ్వరం నుండి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు తాంబరం చేరుకుంటుంది.తిరుగు ప్రయాణంలో ఈ రైలు సాయంత్రం 6.10 గంటలకు తాంబరం నుండి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.40 గంటలకు రామేశ్వరం చేరుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ కొత్త రైలు సర్వీస్ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.