కీలక అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం
NEWS Apr 03,2025 03:16 pm
సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో సచివాలయంలో మంత్రివర్గం సమావేశం ముగిసింది. ఈ కీలక సమావేశంలో కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. ఏపి డ్రోన్ కార్పొరేషనను ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. అనకాపల్లి జిల్లాలోని డీఎలపురం వద్ద క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకు ఆమోదం లభించింది. త్రీ స్టార్, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునకు ఆమోదం.