ఆ 400 ఎకరాలు ఎవరూ కొనకండి
NEWS Apr 03,2025 02:06 pm
మాజీ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. గచ్చి బౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన 400 ఎకరాలను ఎవరూ కొనవద్దని హెచ్చరించారు. తాము తిరిగి పవర్ లోకి వస్తామని, దానిని ఎకో పార్క్ గా మారుస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ప్రభుత్వ, ప్రజల ఆస్తులను అప్పనంగా అమ్మేందుకు ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎక్కడా ప్రజాస్వామ్య స్పూర్తి కనిపించడం లేదన్నారు. ఆనాడు హైదరాబాద్ కు గ్రీన్ సిటీ అవార్డు వచ్చిందన్నారు. ఆ భూములను ఎవరు కొన్నా నష్ట పోతారని పేర్కొన్నారు.