అనాధ పిల్లలకు టీచర్ల ఆర్థిక సాయం
NEWS Apr 03,2025 12:35 pm
ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామానికి చెందిన బిటుకు వర్షిణి, అశ్విత్ అనాధ పిల్లలకు మారేడుపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం గురువారం రూ 60,000 ఆర్థిక సహాయం అందించారు. తమ ఉదారతను చాటుకున్నారు. పాఠశాల హెచ్ ఎం స్వరూప, టీచర్లు రమేష్, తదితరులు సమిష్టిగా వీటిని పోగు చేశారు. అనాథ పిల్లల పేరుపై ఇండియన్ పోస్టల్ లో ఫిక్స్ డిపాజిట్ చేస్తామని, బాండు వారికి అప్పగిస్తామన్నారు.