రిషబ్ పంత్ పై సంజీవ్ గోయెంకా గుస్సా
NEWS Apr 03,2025 09:28 am
మైదానంలోనే ఎస్ ఎస్ జీ యజమాని సంజీవ్ గోయెంకా అందరి ముందే రిషబ్ పంత్ ను చెడా మడా తిట్ల దండకం అందుకున్నాడు. స్పోర్ట్స్ పరంగా కొన్ని రూల్స్ ఉంటాయని మరిచి పోయాడు. ఇలా ప్రవర్తించడం బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ రూల్స్ కు విరుద్దమని తెలిసి కూడా తన ప్రవర్తనను మార్చుకోలేదు. గత సీజన్ లో సైతం ఇలాగే వ్యవహరించాడు. నవ్వుల పాలయ్యాడు. తమ జట్టుకు కేఎల్ రాహుల్ ను ఎంపిక చేసుకున్నారు. తన ఆట తీరుతో ఆకట్టుకోక పోవడంతో రాహుల్ పై నోరు పారేసుకున్నాడు. దీంతో అప్పట్లో సోషల్ మీడియాలో ట్రోల్ కు గురయ్యాడు. తాజాగా పంత్ పై అరుస్తున్న విజువల్స్, ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.