సంజూ శాంసన్ కు బీసీసీఐ ఓకే
NEWS Apr 03,2025 08:58 am
రాజస్థాన్ రాయల్స్ జట్టు స్కిప్పర్ సంజూ శాంసన్ కు భారీ ఊరట లభించింది. తను ఇప్పటి వరకు ఐపీఎల్ 2025 టోర్నీ 18వ సీజన్ లో ప్రత్యేక బ్యాటర్ గా కొనసాగుతూ వచ్చాడు. దీనికి కారణం తన చేతికి గాయం కావడం. దీనిని సీరియస్ గా తీసుకుంది బీసీసీఐ. ఈ మేరకు తను మూడు మ్యాచ్ లకు దూరంగా ఉండాలని ఆదేశించింది. మెరుగైన చికిత్స తీసుకోవడంతో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో టెస్ట్ నిర్వహించారు. అక్కడ రిపోర్ట్ లో ఏమీ లేదని తేలింది. లైన్ క్లియర్ ఇచ్చింది. దీంతో తదుపరి మ్యాచ్ లకు తను రాజస్థాన్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇప్పటి దాకా రియాన్ పరాగ్ స్టాండింగ్ స్కిప్పర్ గా ఉన్నాడు.