పర్యావరణాన్ని కాపాడుకుందాం
NEWS Apr 03,2025 07:25 am
ప్రజా గాయకురాలు విమలక్క నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ను ఏకి పారేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూమిని విద్యేతర వ్యాపార ప్రయోజనాలకు కేటాయించిన ప్రభుత్వం ఏకకాలంలో విద్యావరణాన్ని, పర్యావరణాన్ని దెబ్బ తీస్తుండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సాంకేతికంగా ఈ భూమి సర్కార్ దేనని సుప్రీంకోర్టులో గెలిచినంత మాత్రాన దాన్ని అభివృద్ధి పేరిట ప్రైవేటు సంస్థలకు తెగనమ్మడం విద్యా ప్రయోజనాలను, విద్యార్థుల ప్రయోజనాలను విస్మరించడమే అవుతుందన్నారు.