కుస్తీ పోటీ విజేతకు ఐదు తులాల వెండి కడియం
NEWS Apr 02,2025 11:28 pm
సంగారెడ్డి జిల్లా:నారాయణఖేడ్:నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని (డి)బాన్సువాడ గ్రామంలో అలరించిన కుస్తీల పోటీలు బారడ పోచమ్మ జాతర మహోత్సవ భాగంగా కుస్తీ పోటీలు అందర్నీ బాగా ఆకట్టుకున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మలయోధులు కళ్ళంలో తలబడి నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడ్డారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. చివరకు కుస్తీలో తలబడ్డ విజేతకు 5 తులాల వెండి కడియం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.