పాత ధాంరాజ్ పల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ
NEWS Apr 02,2025 09:57 pm
మల్లాపూర్ పాత ధాంరాజ్ పల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ముల చిన్నారెడ్డి. దేశంలో పేదలకు సన్నబియ్యం ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం చరిత్రలో నిలిచి పోతుందని తెలిపారు. రేషన్ షాప్ డీలర్లు వినియోగదారులకు ఎక్కువ సమయం కేటాయించి వారికి సహకరించాలని కోరారు.