సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకం
NEWS Apr 02,2025 03:28 pm
సన్న బియ్యం పంపిణీ పథకం అమలు చేయడం చారిత్రాత్మకమని మెట్ పల్లి ఏఎంసీ చైర్మన్ కూన గోవర్ధన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్యం పంపిణి కార్యక్రమాన్ని బుధవారం మెట్ పల్లి పట్టణంలోని 13వ వార్డు రేగుంటలో గల రేషన్ దుకాణంలో వ్యవసాయ కమిటీ మార్కెట్ చైర్మన్ కూన గోవర్ధన్ ప్రారంభించారు. కొత్త రేషన్ కార్డులకు 20 లక్షల మందిని రేషన్ కార్డులలో పేర్లు చేర్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల పది లక్షల మందికి సన్న బియ్యాన్ని ఇవ్వనున్నామని తెలిపారు.