ఉచిత రేషన్ బియ్యం ప్రారంభం
NEWS Apr 02,2025 03:30 pm
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత సన్న బియ్యం పథకాన్ని పట్టణంలోని 12వ వార్డు పరిధిలోని పలు రేషన్ షాప్ లలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మహమ్మద్ షాకిర్ సిద్దికి ప్రారంభించి లబ్ధిదారులకు స్వయంగా బియ్యం పంపిణీ చేశారు.ఈ పథకం ద్వారా అర్హత గల కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ప్రతి పేద కుటుంబం ఆకలికి గురికాకుండా, పోషకాహారాన్ని సమృద్ధిగా అందుకునేలా ఈ పథకం రూపొందించ బడిందని తెలిపారు.