కేంద్రంతో శాంతి చర్చలకు సిద్దం
NEWS Apr 02,2025 12:45 pm
మావోయిస్టు పార్టీ కేంద్ర అధికార ప్రతినిధి అభయ్ సుదీర్ఘ లేఖ రాశారు. కేంద్రంతో శాంతి చర్చలకు సిద్దమని ప్రకటించారు. ఇందు కోసం సానుకూల వాతావరణం సృష్టించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించాలని కోరారు. ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో హత్యాకాండలను ఆపాలన్నారు..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ప్రతిపాదిస్తే, కాల్పుల విరమణ ప్రకటిస్తామన్నారు.