టీటీడీపై సీఎం చంద్రబాబు సమీక్ష
NEWS Apr 02,2025 12:40 pm
తిరుమల పుణ్య క్షేత్రంపై సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షకు చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె. శ్యామల రావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వి. వీరబ్రహ్మం హాజరయ్యారు. తిరుమల పవిత్రత, భక్తుల రద్దీ, అభివృద్ది , ఇతర రాష్ట్రాలలో శ్రీవారి ఆలయాల నిర్మాణం, భక్తులకు సౌకర్యాలు, తదితర అంశాలపై సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా సీఎం దిశా నిర్దేశం చేశారు.