కోట్లు పలికినా ఆట నిరాశేనా
NEWS Apr 02,2025 07:47 am
దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 వేలం పాటలో అత్యధిక ధరకు అమ్ముడు పోయాడు క్రికెటర్ రిషబ్ పంత్. తనను ఏరికోరి లక్నో సూపర్ జెయింట్స్ భారీ ధరకు కొనుగోలు చేసి ఇతర ఫ్రాంచైజీలకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇదే సమయంలో వచ్చీ రావడంతోనే తన జట్టుకు పంత్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది. తీరా చూస్తే ఏదో ఆడుతాడని, గట్టెక్కిస్తాడని అనుకుంటే జట్టు యాజమాన్యంతో పాటు అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు. ఇప్పటి వరకు టోర్నీలో మూడు మ్యాచ్ లు ఆడితే తాను రెండెంకల స్కోర్ కూడా చేయలేదు. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్ కు గురవుతున్నాడు.