ఆ భూములు యూనివర్శిటీవి కానే కావు
NEWS Apr 02,2025 06:43 am
మంత్రి శ్రీధర్ బాబు సీరియస్ కామెంట్స్ చేశారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టడంపై ఫైర్ అయ్యారు. కంచె గచ్చి బౌలి లోని సర్వే నెంబర్ 25 లోని 400 ఎకరాల భూమి తమదేనంటూ రేవంత్ రెడ్డి సర్కార్ అంటోంది. ఈ భూముల వేలానికి సిద్దమైంది. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపాయి ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ , సీపీఎం. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ సర్వేలో కూడా సర్కార్ వేనంటూ తేలిందన్నారు మంత్రి. ఇది మంచి పద్దతి కాదన్నారు.