సమస్యల పరిష్కారానికి మంత్రికి వినతి
NEWS Apr 01,2025 11:43 pm
అరకు నియోజకవర్గంలోని మౌలిక వసతులు సమస్యలు పరిష్కారించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ మాజీ సభ్యులు సివేరి అబ్రహం కోరారు. ఈ మేరకు సాలూరులో ఉన్న రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలిసి నియోజకవర్గంలోని రోడ్లు తాగునీటి సమస్య గురించి వివరించి, పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. సమస్య పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారని అబ్రహం తెలిపారు .