ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీకి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు తెలిపారు. మల్లాపూర్ మండలంలోని గుండంపల్లి గ్రామంలో శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అంతడుపుల పుష్పలత నరసయ్యతో కలిసి గుండంపల్లిలో సన్నబియ్యం పంపిణి చేశారు.