కోరుట్ల పట్టణ 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చిట్యాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో స్థానిక వార్డులో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఇట్టి చలివేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు ప్రారంభించారు. అనంతరం జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ.. రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షించ దగ్గ విషయమన్నారు. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు మునుముందు మరెన్నో చేయాలని కోరారు.