వాట్సప్లో ఇంటర్మీడియట్ ఫలితాలు
NEWS Apr 01,2025 05:40 pm
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 12-15 మధ్య విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏప్రిల్ 6 నాటికి మూల్యాంకనం పూర్తవుతుంది . ఆ తర్వాత కంప్యూటరీకరణ వర్క్ ఉంటుంది. దీనికి ఐదారు రోజులు సమయం పడుతుంది. ఈసారి వాట్సప్లోనే ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో విద్యార్థి మార్కులను పీడీఎఫ్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. ఇవే షార్ట్ మెమోలుగా ఉపయోగప డనున్నాయి. గతంలో ఫలితాలు ఇచ్చి, ఆ తర్వాత షార్ట్ మెమోలను ఆన్లైన్లో ఉంచేవారు. ఈసారి వాట్సప్లో ఫలితాలు ఇస్తున్నందున పీడీఎఫ్ రూపంలో మార్కులు ఇవ్వనున్నారు.