దుర్గమ్మ కు ప్రత్యేక పుష్పార్చన
NEWS Apr 01,2025 05:31 pm
వసంత నవరాత్రుల్లో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మ వారికి మూడవ రోజైన మంగళ వారం పసుపు, తెలుపు చామంతులు, మల్లెపూలు తో ప్రత్యేక పుష్పార్చన వైభవం గా జరిగింది. నూతనంగా నిర్మించిన పూజా మండపం ( నటరాజ స్వామి ఆలయ ప్రాంగణం)లో ఉదయం 9 గంటల నుండి పుష్పార్చన ప్రారంభమైంది. ప్రధాన ఆలయం నుండి పుష్పాలతో అర్చకులు, అధికారులు అర్చన ప్రాంగణంకి వెదురు బుట్టలతో పుష్పాలు తీసుకొని అమ్మ వారికి సమర్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ సమయంలో దుర్గాదేవిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.