యథావిధిగా 10వ తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష
NEWS Apr 01,2025 07:01 am
ఏపీలో జరుగుతున్న 10వ తరగతి పరీక్షల్లో భాగంగా ఏప్రిల్ 1న మంగళవారం సోషల్ స్టడీస్ పరీక్షను యథాతథంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు పాఠశాల విద్యా కమిషనర్ విజయ్ రామ రాజు. ఈ పరీక్ష ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుందన్నారు. దీంతో పరీక్ష నిర్వహణకు సంబంధించిన అందరూ అధికారులు ఎలాంటి అపోహలు లేకుండా పరీక్ష సజావుగా నిర్వహించాలని సూచించారు. ఈ విషయాన్ని ఆర్జేడీలు, జిల్లా విద్యాశాఖాధికారులు, సంబంధిత అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తెలపాలని కోరారు.