యూనివర్శిటీ భూములపై సర్కార్ మరో లేఖ
NEWS Apr 01,2025 06:57 am
గచ్చిబౌలి లోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి చెందిన 400 ఎకరాల భూముల వ్యవహారం తీవ్ర దుమారానికి దారి తీసింది. విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ దమనకాండను తప్పు పడుతున్నాయి. ఇప్పటికే ఆ భూములన్నీ తమవేనంటూ ప్రభుత్వం స్పష్టం చేస్తూ ఓ లేఖ విడుదల చేసింది. తాజాగా మరో లేఖను రిలీజ్ చేసింది. 2004లో హెచ్ సీ యూ భూములను ప్రభుత్వానికి అప్పగించిందని, అప్పటి రిజిస్ట్రార్ నరసింహులు ఆ పత్రంపై సంతకం చేశారని తెలిపింది. ఆనాడు 534.28 ఎకరాల భూమిని అప్పగించినందుకు గాను గోపన్ పల్లిలో సర్వే 36లో 191 ఎకరాలు, 37లో 205 ఎకరాలను సర్కార్ కేటాయించిందన్నారు.