ఏపీలో వడగాలుల ప్రభావం
NEWS Apr 01,2025 06:47 am
ఏపీలో వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉండబోతోందని హెచ్చరించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. శ్రీకాకుళం జిల్లా-6, విజయనగరం జిల్లా-6, పార్వతీపురంమన్యం జిల్లా-10, అల్లూరి సీతారామరాజు జిల్లా-3, తూర్పుగోదావరి కోరుకొండ మండలాల్లో (26) వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. బుధవారం 28 మండలాల్లో వడగాలులు వీస్తాయన్నారు. గురువారం రాయలసీమ, శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు.