కూరగాయల మార్కెట్ సమయాలు మార్పు
NEWS Mar 31,2025 05:37 pm
ఆలమూరు మండలం మడికి నాలుగు లైన్ల జాతీయ రహదారి చెంతనున్న అంతర్రాష్ట్ర కూరగాయల మార్కెట్ వేళలను మార్పు చేసినట్లు ఆ మార్కెట్ కమిటీ అధ్యక్షులు పాలూరి సత్తిబాబు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఉదయం 5 గంటల నుంచి ఈ మార్కెట్లో కొనుగోలు అమ్మకాలు జరుగుతాయి. అలాగే మధ్యాహ్నం ఒంటిగంట నుంచి తిరిగి మార్కెట్ ప్రారంభం అవుతుందని ఈ మారిన వేళలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయన్నారు