బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై సిట్ ఏర్పాటు
NEWS Mar 31,2025 03:07 pm
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం పై విచారించేందుకు సిట్ ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు డీజీపీ జితేందర్. ఈ దర్యాప్తు బృందానికి ఐజీ రమేష్ సారథ్యం వహిస్తాడని తెలిపారు. ఎం. రమేష్ తో పాటు ఎస్పీ లు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్, శంకర్ లు కూడా ఈ టీంలో సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ పైన రెండు కేసులు నమోదు చేశామన్నారు. హైదరాబాద్ పంజాగుట్ట తోపాటు సైబరాబాద్ మియాపూర్లో కేసులు నమోదైనట్లు తెలిపారు. 25 మంది టాలీవుడ్ , బాలీవుడ్ కు చెందిన నటులతో పాటు యూట్యూబర్స్ పై కేసులు నమోదు చేశామన్నారు. ఈ రెండు కేసుల ను కూడా సిట్ కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందించాలని సిట్ ను ఆదేశించామన్నారు.