విశాఖలో నారా లోకేష్ ప్రజా దర్బార్
NEWS Mar 31,2025 01:26 pm
మంత్రి నారా లోకేష్ విశాఖలో సోమవారం టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ చేపట్టారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న సామాన్య ప్రజానీకం నుంచి అర్జీలు స్వీకరించారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇతర రాష్ట్రాల మాదిరిగా రెగ్యులరైజేషన్ కాకుండా ప్రత్యేక ఉపాధ్యాయుల నియామకాలను కేవలం డైరెక్ట్ రిక్రూట్ మెంట్( డీఎస్సీ నోటిఫికేషన్) పద్ధతిలో మాత్రమే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ప్రత్యేక ఉపాధ్యాయ సమాఖ్య ప్రతినిధులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.