సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి
NEWS Mar 31,2025 08:04 am
MBNR: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబ్ నగర్ పట్టణ వన్ టౌన్ ఏఎస్ఐ సజ్జద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆయన యువతకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏదైనా తెలియని లింకు మీ వాట్సాప్ నెంబర్కు వస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదన్నారు.