హమ్మయ్య రాజస్థాన్ గెలిచింది
NEWS Mar 31,2025 07:34 am
ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా గౌహతిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ఎట్టకేలకు బోణీ కొట్టింది రాజస్థాన్ రాయల్స్. చెన్నై సూపర్ కింగ్స్ ను 6 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. నితీశ్ రాణా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. ఎప్పటిలాగే సంజూ శాంసన్ , జైశ్వాల్ నిరాశ పరిచాడు. హస్ రంగా అద్భుతంగా బౌలింగ్ చేయడంతో చెన్నై ఓటమి పాలైంది. చివరి ఓవర్ దాకా ఉత్కంఠ చోటు చేసుకుంది. ధోనీ మైదానంలోకి వచ్చినా ఫలితం లేకుండా పోయింది.