జోగులాంబ అమ్మ వారికి రూ. కోటి 60 లక్షల కిరీటం
NEWS Mar 31,2025 08:05 am
GDWL: జోగులాంబ అమ్మ వారికి ఇవాళ బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగుల బృందం భారీ బంగారు కిరీటం సమర్పించారు. వారికి ఆలయ ఈవో పురేందర్, ఛైర్మన్ నాగేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం అమ్మ వారిని దర్శించుకుని కిరీటాన్ని EOకు అందజేశారు. 1 కేజీ 587 గ్రా.ల బంగారు కిరీటం విలువ రూ. 1 కోటి 60 లక్షల 10 వేలు ఉంటుందన్నారు.