జువ్వాడి భవన్లో పంచాంగ శ్రవణం
NEWS Mar 31,2025 08:13 am
కోరుట్ల పట్టణ జువ్వాడి కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్లో విశ్వవసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా విచ్చేసిన నాయకులకు ఉగాది పచ్చడి అందజేశారు . ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావు, విజేత దంపతులతో పాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజాం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు.