మరో 10 ఏళ్లు రాష్ట్రంలో పవర్ మాదే
NEWS Mar 30,2025 04:41 pm
మరో పదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ పేదల దేవాలయం లాంటిదన్నారు. ప్రతిపక్షాలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయంటూ ఆరోపించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జనం వారిని నమ్మరని అన్నారు.