హెచ్సీఏ చిల్లర రాజకీయాలు చేస్తోంది
NEWS Mar 30,2025 04:24 pm
సన్ రైజర్స్ యాజమాన్యం సంచలన ఆరోపణలు చేసింది. ఐపీఎల్ 2025లో భాగంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( హెచ్ సీ ఏ) టికెట్ల కోసం సతాయిస్తోందని ఆరోపించింది. తమను చంపుకు తింటోందంటూ ఆరోపించింది. హెచ్సీఏతో ఈ బాధలు పడలేమని పేర్కొంది. మరో చోటికి వెళ్లి పోతామని హెచ్చరించింది. ఇప్పటికే ప్రతీ మ్యాచ్ కు 3,900 కాంప్లిమెంటరీ టికెట్లు ఇస్తున్నామని వెల్లడించింది. చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించింది.