పేద కుటుంబాలకు వీఆర్ ఫౌండేషన్ ఆసరా
NEWS Mar 30,2025 04:25 pm
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 10 వార్డులో నిత్యావసర సరుకులను నిరుపేద ముస్లిం కుటుంబాలకు పిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పెగడ రమేష్ యాదవ్ అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.రంజాన్ పవిత్ర మాసంలో నెల రోజుల పాటు ముస్లింలు కఠిన ఉపవాస దీక్ష చేపడతారని, రంజాన్ పవిత్ర పర్వదినం కోసం నిరుపేదలకు ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం ఇలాగనే అందిస్తామని , ఎల్లవేళల నిరుపేద కుటుంబాలకు పి.ఆర్ ఫౌండేషన్ అండగా ఉంటుందని పేర్కొన్నారు.