షెడ్లు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ
NEWS Mar 30,2025 10:25 am
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ నిధులతో నిర్మిస్తున్న జిఐ షెడ్ల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భూమి పూజ చేశారు. భక్తుల సౌకర్యార్థం 2 షెడ్లు నిర్మిస్తున్నట్లు.. ఒకటి వాహనాలు నిలుపు స్థలంలో, రెండోది కళ్యాణ కట్ట ఎదురుగా దాదాపు 70 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీకాంత్ రావు, సీఐ నీలం రవి, ఎస్సై నరేష్ కుమార్, ఆలయ అర్చకులు, నాయకులు పాల్గొన్నారు.