ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు
NEWS Mar 30,2025 01:55 pm
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా సీఎం ఉగాది పచ్చడిని స్వీకరించారు. పండితులు మాడుగుల నాగఫణిశర్మ పంచాగ శ్రవణం చేశారు. ఈ వేడుకల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు.