ముత్యపు పందిరి వాహనంపై రామచంద్రుడు
NEWS Mar 30,2025 01:26 pm
తిరుపతి శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ రంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామ స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామి వారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు.