సీఎం చంద్రబాబుకు టీటీడీ చైర్మన్ ఆహ్వానం
NEWS Mar 30,2025 01:16 pm
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు ముఖ్యమంత్రి ని తాడేపల్లిగూడెంలోని తన నివాసంలో చంద్రబాబును కలిశారు. ఈ సందర్బంగా తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. ఉగాది పర్వదినం సందర్బంగా పంచాంగాన్ని కూడా ఇచ్చారు. ఈ సందర్బంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11వ తేదీ నిర్వహించే స్వామి వారి కల్యాణోత్సవానికి విచ్చేయాలని టీటీడీ చైర్మన్ , ఈవో ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను అందజేశారు సీఎంకు. కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరారు.