ఉగాది పండగ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి లబ్దిదారులకు బియ్యాన్ని పంపిణీ చేశారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు మాట నిలబెట్టుకున్నామని చెప్పారు సీఎం. అర్హులైన రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. ఏ ఒక్కరూ ఆకలితో ఉండ కూడదనే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.