15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
NEWS Mar 29,2025 02:04 am
తెలంగాణలో ఎండల తీవ్రత, వడగాల్పుల ప్రభావం పెరుగుతోంది. 15 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ఆ జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, కొమరంభీం, మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణలో గరిష్టంగా 41 డిగ్రీలు దాటింది ఉష్ణోగ్రత. నేటి నుంచి మరింతగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని తెలిపింది.