అన్నమయ్య కీర్తనలతో సామాజిక చైతన్యం
NEWS Mar 29,2025 01:28 am
సమాజంలో విలువలను పునరుద్ధరించి, సామాజిక, ఆధ్యాత్మిక చైతన్యం పెంచేందుకు అన్నమయ్య కీర్తనలు ఎంతగానో దోహద పడతాయని ఎస్వీ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు సర్వోత్తమరావు పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 522వ వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో జరుగుతున్న సాహితీ సదస్సులు రెండో రోజుకు చేరుకున్నాయి. అన్నమయ్య సంకీర్తనలు సామాజిక దృష్టి అనే అంశంపై ఉపన్యసించారు. ఆనాటి సామాజిక పరిస్థితుల్లో అన్ని వృత్తుల వారు సమానమేనని పేర్కొన్నారని అన్నారు.